10-06-2025 04:43:52 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో ‘అమ్మ మాట - అంగన్వాడి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గ మాట్లాడుతూ... 3 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీ సెంటర్ కు తప్పకుండా పంపించాలని, మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆటపాటల ద్వారా విద్య నేర్పడంతో పిల్లల మేదోశక్తి పెంపొందుతుందని పేర్కొన్నారు. అలాగే పిల్లలకు పోషకాహారం అందించడం వల్ల పిల్లలు ఏలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎదుగుదలకు అంగన్వాడి కేంద్రాలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎన్.రాజేందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ రమ, ఫీల్డ్ అసిస్టెంట్ రామ తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.