04-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వలిగొండ, అక్టోబర్ 3 (విజయక్రాంతి): భువనగిరి నియోజకవర్గం పరిధిలోని సాగునీటి కాలువలు అన్నిటిని పూర్తిచేసి సస్యశ్యా మలం చేస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ మండలంలోని పహిల్వాన్ పురం గ్రామం పరిధిలో గల బునాదిగాని చెరువును మరియు కాలువలను ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించి అలుగు పోస్తున్న చెరువులకు పూలు చల్లి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దా కాలంగా గత ప్రభుత్వం బునాదిగాని కాలువను పూర్తి చేయలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని కాలువలు అన్నిటిని పూర్తి చేసేందుకు నిధులను మంజూరు చేయించడం జరిగిందని పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. బునాదిగాని చెరువు ద్వారా టేకులసోమవారం, పహిల్వాన్పురం, రెడ్లరేపాక, కంచనపల్లి, పులిగిల్ల తదితర గ్రామాలకు సాగునీరు అందుతుందని దీంతో భూగర్భ జలాలు కూడా గణనీయం గా పెరుగుతాయన్నారు. రైతుల కండ్లల్లో ఆనందం చూసేందుకు నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాల్వను పూర్తి చేస్తానని అన్నారు. పాశం సత్తిరెడ్డి, బత్తిని సహదేవ్, పల్చం సతీష్, మాదశంకర్ పాల్గొన్నారు.