19-06-2025 12:14:23 AM
రామ్చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రిమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. ఇది ఇండియన్ యాక్షన్ సినిమాల ప్రమాణాలను పెంచేలా రూపొందిస్తున్న ట్రైన్ ఎపిసోడ్ అని టీమ్ వెల్లడించింది.
ఈ ట్రైన్ స్టంట్ కోసం రూపొందించిన సెట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని టీమ్ చెప్తోంది. ఈ ఎపిసోడ్లో రామ్చరణ్ తన కెరీర్లోనే అత్యంత రిస్కీ స్టంట్స్ చేస్తున్నారని, ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈ నెల 19తో ముగియనుందని తెలిపింది. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహ్మాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.