19-06-2025 12:16:01 AM
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘8 వసంతాలు’. అనంతిక సునీల్కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ అనంతిక మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నాలుగైదు సినిమాలు చేశాను. కానీ ఇలాంటి అనుభవం నా జీవితంలో ఎప్పుడూ కలుగలేదు. ఇదంతా ఒక కలలాగా ఉంది. శుద్ధి అయోధ్య లాంటి బలమైన క్యారెక్టర్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.
ఇలాంటి రోల్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ పాత్రకు చాలా లోతుగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా డీప్గా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నా” అన్నారు. డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. “చిన్న సినిమా.. పెద్ద సినిమాని కాదు.. మంచి సినిమానా కాదా అనేది చూస్తారు. ఒక మంచి సినిమా వస్తే చేస్తారనే దానికి నేనే నిదర్శనం. అనంతిక ఈ సినిమా చేయడానికి డబ్బు కూడా అక్కర్లేదని చెప్పింది. టాలెంట్ కంటే ఇలాంటి పాషన్ ఉండడం చాలా గొప్ప విషయం. ఒక 17 ఏళ్ల అమ్మాయికి డబ్బు సంపాదించుకోవడం తెలుసు, వద్దు అనుకోవడం తెలుసు.
ఇది చాలా గొప్ప విషయం. సినిమా అంతా రివర్స్లో వెళ్తుంది. అందుకే ఓపెనింగ్ సీక్వెన్స్ ఎవరూ మిస్ అవ్వద్దు అని కోరుతున్నా. ప్రేక్షకుడిగా థియేటర్కు వెళ్లినవారు ప్రేమికులుగా బయటకు వస్తారు” అని చెప్పారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు అనంతిక, ఫణి బిగ్గెస్ట్ పిల్లర్స్. రవి, హను కూడా ఎక్స్ట్రార్డినరీగా నటించారు. క్లాసికల్ డాన్స్ మార్సల్ట్స్ రెండు వచ్చిన అమ్మాయి కావాలని ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది.. తనే అనంతిక. ఈ సినిమా ఒక అమ్మాయి జర్నీ. ఒక అమ్మాయి జీవితమే 8 వసంతాలు” అన్నారు.
మరో నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “చాలా కొత్త టాలెంట్ ఇందులో పనిచేశారు. వాళ్లందరి కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్లు నందినిరెడ్డి, నీరజ కోనతోపాటు ఈ చిత్రంలో నటించిన రవితేజ, హనురెడ్డి, కన్నా పసునూరి, లిరిక్ రైటర్ వనమాలి, మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్, ఎడిటర్ శశాంక్, డీవోపీ విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.