calender_icon.png 28 July, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీఎంను ఢీకొట్టిన బైక్

27-07-2025 10:13:13 PM

ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): జీడిమెట్ల పోలీస్ స్టేషన్(Jeedimetla Police Station) పరిధిలోని ఐడిపిఎల్ గాంధీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ పై వెళుతున్న ముగ్గురు మైనర్లు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శివ(18), సూరజ్(17), బాలు(17)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శివ మృతిచెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న సూరజ్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురు బీహార్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.