27-07-2025 10:10:09 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి వద్ద నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీకి వరద పోటెత్తింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నది, ప్రణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ వద్ద 4,40,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడంతో మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లను ఎత్తి 4,40,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం వచ్చే భక్తులు గోదావరి ప్రవాహం ఎక్కువ ఉన్నందున స్నానా గట్టాల వద్ద స్నానాలు చేయాలని దేవస్థాన అధికారులు సూచించారు.