28-06-2025 12:08:11 AM
పటాన్ చెరు, జూన్ 27 : బైకులను చోరీ చేస్తున్న ముఠాను బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సీఐ రవీందర్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కిష్ణాయపల్లి సర్కిల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటోలో ఉన్న కొంతమంది వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు.
వారిని అదుపులోకి తీసుకొని విచారించగా కౌడిపల్లి గ్రామానికి చెందిన షేక్ ఫక్రుద్దీన్, మీనం పల్లి జగన్, బౌరంపేట రాజేష్ లు గత 20 రోజుల నుంచి దుండిగల్, సూరారం, నర్సాపూర్ పీఎస్ పరిధిలోని పలు గ్రామాలలో బైక్ లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు.
వారి దగ్గర నుంచి 9 బైకులను స్వాదీనం చేసుకొని, చోరీలకు పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన ఆటో డ్రైవర్ జగన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్ల సీఐ తెలిపారు. కేసును చేదించిన ఎస్ఐ కృష్ణారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణరెడ్డి, కానిస్టేబుల్ జైపాల్ లకు రివార్డులు అందించి అభినందించినట్లుసీఐవివరించారు.