calender_icon.png 10 May, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలు మామను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి

09-05-2025 07:16:36 PM

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

జుక్కల్,(విజయక్రాంతి): ప్రస్తుతం కురుమ సమాజానికి కావలసిన విద్య పశువుల కాపరులుగా మారి దూరం చేసుకుంటున్నారని, అంతకుముందే చదువుకోకున్న గాని 15 గొర్లతో బాలు మామ అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య అన్నారు. ప్రతి ఒక్కరూ చెడు గుణాలను వదిలి సన్మార్గంలో నడిచినప్పుడు మహాత్ములుగా తయారవుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం కురుమ సమాజం నుంచి తాను ఒక్కడినే రాజకీయంలో ఉన్నానని అన్నారు. తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిందిగా ఆయన కోరారు.

అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. ప్రజలు సన్మార్గంలో నడిస్తే పోలీస్ స్టేషన్లో అవసరమే ఉండదని ఒకవేళ అదే విధంగా జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామంలో ప్రజలందరూ పోలీసుల దగ్గరికి రాకుండా ఉంటే ప్రభుత్వానికి తాను పోలీస్ స్టేషన్లో వద్దని సిఫార్సు చేస్తానని అన్నారు. అందరూ మంచి ఉద్దేశంతో ఎవరికి ద్వేషించకుండా ఉంటే ఎలాంటి గొడవలు హింసత్మకమైన చర్యలు ఉండవని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు బీర్ల ఐలయ్య, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావులకు మంత్రి పదవులు దక్కుతాయని కురుమ సంఘం జిల్లా నాయకులు అన్నారు.

ఇటీవల కాలంలో కొనసాగుతున్న చర్చ అసెంబ్లీలో క్యాబినెట్ విస్తరణ సంబంధించిన విషయాలపై ప్రతి రోజు ఏదో ఒక సామాజిక మాధ్యమాల్లో గాని పత్రికల్లో గాని వినిపిస్తున్న విషయం అందరికీ విధితమే. ఇందులో భాగంగానే జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామంలో శుక్రవారం కురుమ కులస్తులు బాలు మామ విగ్రహ ప్రతిష్టాపన శిఖర స్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు బీర్ల ఐలయ్య, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు లకు ఆహ్వానించారు. కార్యక్రమం పూర్తి అయిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఇద్దరు మంత్రులుగా అవుతారని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఎస్సీ కోటాలో జుక్కల్ ఎమ్మెల్యే, కురుమ సామాజిక వర్గంలో ప్రభుత్వ విప్ లకు మంత్రి పదవి రావాలని, ఇద్దరు కూడా రేసులో ఉన్నట్లు పేర్కొన్నారు. మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే మంత్రి పదవి రావాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమం చివర్లో వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు సతీష్ పటేల్ శివానంద్, బీఆర్ఎస్  నాయకులు తదితరులు పాల్గొన్నారు.