11-02-2026 02:40:25 AM
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): నారాయణపేట్ జిల్లా మక్తల్ ము న్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటనపై బీజేపీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, ఇతర నేతలు కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినిని మంగళవారం కలిసి వినతిప త్రం సమపర్పించారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో ఎన్.రాంచందర్ రావు సమావేశమై మక్తల్ ఘటనను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పలువురు అధికార పార్టీ నేతలు తమ అభ్యర్థులను వేధిస్తున్నారని, నామినేషన్లను విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి తీసు కొచ్చారని రాంచందర్ రావు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఆయన విజ్ఞప్తి చేశారు.