4 July, 2026 | 10:11 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఉపఎన్నికలో బీజేపీ అవకతవకలు

25-11-2024 02:47 AM

ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్

లక్నో, నవంబర్ 24: ఉత్తరప్రదేశ్‌లోని కుందర్కి ఉపఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ ఆరోపించారు. నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట అని, పోలిం గ్ రోజు వందలాది మంది ఓటర్లను ఓటు వేయకుండా అధికార పార్టీ అడ్డుకున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

న్యాయం కోరేందుకు, బీజేపీపై ఫిర్యా దు చేసేందుకు లక్నో వస్తున్న ఓటర్లను సీతాపూర్‌లో  పోలీసులు అడ్డుకున్నారని, వారిని అరెస్ట్ చేయడం దుర్మా ర్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అరెస్ట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో పాటు సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 20న కుందర్కిలో ఉపఎన్నిక జరగగా, బీజేపీ అభ్యర్థి రాంవీర్ ఠాకూ ర్ 1.4 లక్షల మెజార్టీతో విజయం సాధి ంచారు. ఆయన గెలుపుపై అనుమానాలు ఉన్నాయని, కొందరిని ఓట్లు వేయకుండా చేసి బీజేపీ గెలిచిందని ఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు.