calender_icon.png 5 September, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల అభివృద్దే మోదీ లక్ష్యం

05-09-2025 09:04:43 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): పీర్జాదిగూడ  మున్సిపల్ కార్పోరేషన్  బీజేపీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి బిజెపి నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రకోటపై చెప్పిన మాటను నిలబెట్టుకున్న మన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కొత్త జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలందరికీ మరింత  ఆర్థిక లాభాలు చేకూరుతాయని, ఇది రైతు నుండి విద్యార్థి వరకు,వ్యాపారి నుండి వినియోగదారు వరకు అందరికీ ఊరట ఇచ్చే సంస్కరణలు, కేవలం పన్ను సంస్కరణ కాదు.

వికసిత భారత్ కోసం బలమైన అడుగులు  అన్నారు. నిత్యవసర వస్తువులు, ఇరిగేషన్ పరికరాలు, ఆటో ఎలక్ట్రానిక్ పరికరాల జీఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గాయని అన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా యువమోర్చా అధ్యక్షులు పవన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరూప్ , జిల్లా అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి , సుజాత, సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి, సుధాకర్ చారి, శశి, ప్రధాన కార్యదర్శి బాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.