18-11-2025 09:02:10 PM
ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): స్థానిక ఖమ్మం 1వ పట్టణం 18వ డివిజన్ నందు శ్రీ దివ్య మణికంఠ అన్నదాన సేవ సమితి ట్రస్ట్ చైర్మన్ చిర్ర రవి, TV పుల్లం రాజు వారి కమిటీ ద్వారా ఏర్పాటు చేయబడిన అయ్యప్ప మండపాన్ని మంగళవారం భారతీయ జనతాపార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మండల అధ్యక్షులు గడీల నరేష్ లు సందర్శించి పూజలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన మహా అన్న సంతర్పణ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ వేసుకున్న భక్తులతో కలిసి సహాపంక్తి భోజనం చేయటం జరిగింది.
ఈ సందర్బంగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ హైందవ ధర్మంలో భాగంగా గత 7 సంవత్సరాల నుండి ప్రతీ కార్తీకమాసం నందు ఈ అయ్యప్ప మండపాన్ని ఏర్పాటు చేసి సుమారు 45 రోజుల పాటు ప్రతిరోజూ సుమారు 1500 మంది అయ్యప్పలకు అన్నసంతర్పణ కార్యక్రమంను నిర్వహిస్తున్న శ్రీ దివ్య మణికంఠ అన్నదాన సేవ సమితి ట్రస్ట్ కి ధన్యవాదములు తెలుపటం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషం అన్నారు స్థానిక ప్రజలకు, కమిటీ సభ్యులకు అయ్యప్ప ఆశీస్సులు ఇవ్వాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండప సభ్యులు శ్రీరాముల వీరభద్రం, నిదిగొండ శేఖర్, పుట్ట మల్లికార్జున్, కూరపాటి రవితేజ,, ఉప్పల భూపతి రెడ్డి, శ్రీనివాస్, బీజేపీ నాయకులు నెల్లూరి బెనర్జీ,బండ్ల రిగాన్, గడల నరసింహారావు, పాలేపు రాము, మేడ సంపత్ లు పాల్గొన్నారు.