20 March, 2026 | 6:28 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

'ఏక్ పెడ్ మాకే నామ్' కార్యక్రమంలో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

06-07-2024 01:08 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని బస్టాండ్ ఆవరణ లో మంథని బీజేపీ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ... పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలన్న, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాలన్న మనం పిలుస్తున్న గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచాలన్న సకాలంలో వర్షాలు కురియాలన్నా చెట్లే మనకు ఆధారమని అవి లేకుంటే మనిషి మనుగడే లేదన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్కను నాటాలని సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, పట్టణ కన్వీనర్ సామల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ నాంపల్లి రమేష్, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్, బోగోజు శ్రీనివాస్, చిలువేరి సతీష్, బొల్లంపల్లి లక్ష్మణ్, దాసరి శ్రవణ్, ఎడ్ల సాగర్, దూడపాక రోజా, గుర్రాల రాజు తదితరలు పాల్గొన్నారు.