02-02-2026 02:22:10 PM
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల(Municipal elections) నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా అత్యాధునిక ఎల్ఈడీ ప్రచార రథాలను(BJP LED Campaign Vehicles Launch) సోమవారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించినట్లు పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పట్టణాల అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత ఈ రథాల ద్వారా గడప గడపకూ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లార్, రాజస్థాన్ మాజీ మంత్రి అశోక్ పర్ణామి, ఎంపీ శ్రీమతి రేఖా శర్మ, శ్రీ జీవీఎల్ నరసింహారావు, ఇతరులు పాల్గొన్నారు.