02-02-2026 02:08:07 PM
జామియా మిలియా ఇస్లామియా సెంట్రల్ యూనివర్శిటీ ఇమామ్ హుస్సేన్ (A.S) 1443వ జయంతిని డాక్టర్ ఎం.ఏ అన్సారీ ఆడిటోరియంలో జరుపుకుంది. జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజార్ ఆసిఫ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఇరాన్ కల్చరల్ కౌన్సెలర్ డాక్టర్ ఫరీదుద్దీన్ ఫరీదాసర్ పాల్గొన్నారు. ఇతర ప్రముఖులు హాజీ హనీఫా జాన్, పార్లమెంటు సభ్యుడు (లడఖ్) బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బక్రి మౌలానా సయ్యద్ కల్బే రుషైద్ రజ్వీ, డా. సూఫీ రాజ్ జైన్, ప్రొఫెసర్. అజ్రా అబేది, ప్రొఫెసర్. రైహాన్ అక్తర్ ఖాస్మీ, డాక్టర్. తస్నాకోయిన్. ఫిరోజ్ అహ్మద్ స్వాగతోపన్యాసం చేయగా, ప్రొ. నషీర్ నఖ్వీ ప్రొసీడింగ్స్ నిర్వహించగా, ప్రొఫెసర్ సయ్యద్ కలీమ్ అస్గర్ జాతీయ గీతాలాపన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.