calender_icon.png 30 June, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ పగ్గాలు బీసీలకే ఇవ్వాలి

30-06-2025 02:38:33 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాద్ సిటీ బ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): త్వరలో ప్రకటించబోయే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకే అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో ఆ పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించి,

ఎన్నికల తర్వాత బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఆధిపత్య కులాలకు చెందిన వ్యక్తికి అవకాశం కల్పించిందన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కూడా అగ్రకుల సామాజిక వర్గ వారికే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పిందని, ఇప్పటికైనా బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు.

ప్రస్తుతం బీసీల్లో రాజకీయ చైతన్యం రోజురోజుకు గ్రామస్థాయి వరకు పెరిగిన విషయాన్ని బీజేపీ అధిష్ఠానం ఆలోచించాలని సూచించారు. భవిష్యత్తు లో తాము అధికారంలోకి వస్తే బీసీ ని ముఖ్యమంత్రిని చేస్తామనే సంకే తం బీసీలకు ఇవ్వాలని జాజుల శ్రీని వాస్ గౌడ్ కోరారు.