calender_icon.png 15 July, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ స్థానాలు

14-07-2025 11:18:08 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు..

సూర్యాపేట (విజయక్రాంతి): తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజారిటి స్ధానాలు గెలుచుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు(BJP state president Ramchander Rao) అన్నారు. సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలాజీ గార్డెన్స్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ చూస్తున్నారని, వారు ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీకి నాయకులు కార్యకర్తలు పని చేయాలని, ఇకపై బిజెపిది పోరుబాటని ఆయన అన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, హామీలు అమలు చేసే విధంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిదులు ఇస్తుందని, అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారానే అమలు జరుగుతున్నాయన్నారు. రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని సన్నబియ్యం ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీదని, ప్రతి  రేషన్ దుకాణాల వద్ద నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకి, వరంగల్ లో విమానాశ్రయం కేంద్రం ఏర్పాటు చేస్తుందని రామగుండం ఎరువుల ప్యాక్టరి, బీబీనగర్ లో ఏయిమ్స్ కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు.

ప్రతి ఒక్క కార్యకర్త రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పోరాటాల జిల్లా చైతన్యవంతమైన జిల్లా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. ముందుగా సూర్యాపేట పట్టణంలో బిజెపి నాయకులు భారీ ర్యాలి నిర్వహించారు. రామచంద్ర రావును గజమాలతో సన్మానించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీ లత రెడ్డి,  రెడ్డి, మాజి ఎంపి బూర నర్సయ్య గౌడ్,  మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ప్రభారి రాజమౌళి, పోరెడ్డి కిషోర్ రెడ్డి, కడియం రామచంద్రయ్య, సలిగంటి వీరేంద్ర, చలమల్ల నర్సింహ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.