15 March, 2026 | 11:51 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

నేషనల్ హెరాల్డ్ కేసుపై బీజేపీ యువ మోర్చా ఆందోళన

17-04-2025 02:12 PM

హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం(Tank Bund Ambedkar Statue) వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. బీజేవైఎం నాయకులు(BJYM leaders) ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకు దిగారు. యంగ్ ఇండియా(Young India) పేరిట కాంగ్రెస్ లూటీని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. రాజ్యాంగం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మోకరిల్లాల్సిందేనని యువ మోర్చా పేర్కొంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్డ్ వాద్రా, శామ్ పిట్రోడా ఆస్తులు జప్తు చేయాలని యవ మోర్చా డిమాండ్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.