19-05-2025 12:00:00 AM
కామారెడ్డి, మే 18,(విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలోని వనదుర్గ పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో ఆదివారం కామారెడ్డి కి చెందిన రాజ్ కుమార్- మానస వివాహం వైభావంగా జరిగింది.
ఈ వివాహ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఇలియాస్, రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి గ్రంథాలయం చైర్మన్ మద్ది చంద్రకాంతరెడ్డి, దోమకొండ మాజీ జెడ్పిటీసీ తీగల తిరుమల్ గౌడ్ లు హాజరయ్యారు. నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
వీరి వెంట పిఏ గంగాధర్ దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షులు అనంతరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె రామస్వామి గౌడ్, ఐరన్ సందీప్ కామరెడ్డి కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సీతారాం మధు తాటిపల్లి శ్రీకాంత్, నల్లపు శ్రీనివాస్ ఆడెపు శంకర్ రెడ్డి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ఆశ బోయిన శ్రీనివాస్, సంతోష రెడ్డి, షమ్మీ నయీమ్, రాజు తదితరులు పాల్గొన్నారు.