18-05-2025 11:52:33 PM
దళిత ఎంపీ వంశీకృష్ణను అవమానించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్
మందమర్రి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం దళితుడని అవ-మానించడమేనని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మొయ్య రాంబాబు, కనకం రవీందర్లు డిమాండ్ చేశారు. దళిత ఎంపీని అడుగున అవమానించడంపై అంబేద్కర్ విగ్రహం ఎదుట అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన దళిత ఎంపీ వంశీకృష్ణకు ఆహ్వానం అందకపోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారుల పాత్రపై విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సం ఘం నాయకులు నెరువట్ల శ్రీనివాస్, పాత వీరస్వామి, కోడిపెల్లి రాజయ్య, గంధం పున్నం, బన్న చందర్, కనకం రాజ్ కుమా ర్, విక్కి, సాయికుమార్, విజయ్, విష్ణు, సంజీవ్, నవీన్ పాల్గొన్నారు.