17 April, 2026 | 2:03 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

కృష్ణ మందిర్ పీఠాధిపతిని పరామర్శించిన నాయకులు

19-05-2025 12:00 AM

కామారెడ్డి, మే 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కృష్ణ మందిర్ పీఠాధిపతి మచాలే బాబా అనారోగ్యానికి గురి అయిన విషయం తెలుసుకొని ఆదివారం పలువురు నాయకులతో కలిసి పరామర్శించారు.

గాంధారి కామారెడ్డి లో కృష్ణ మందిరాల పీఠాధిపతి అయిన బాబా నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ, హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గత 15 రోజులుగా వైద్య చికిత్స పొందారు. స్వయంగా గాంధారి కృష్ణ మందిర్ కి వెళ్లి బాబాను పరామర్శించి యోగక్షేమాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

తొందరగా ఆరోగ్యం కోలుకొని మళ్లీ దేవునికి పూజలు చేయాలని ఆకాంక్షించారు. పరమర్శించిన వారిలో ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, టిఆర్‌ఎస్ గాంధారి మండల అధ్యక్షులు వజిర్ శివాజీ రావు, రాష్ట్ర ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, మాజీ డిసిఎంఎస్ డైరెక్టర్ వజీర్ ముకుందరావు, మాణిక్ రావు, నర్సింగ్ రావు, తదితరులున్నారు.