ఫార్ములా ఈ-కార్ రేసు కేసు.. ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డి
హైదరాబాద్,(విజయక్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు(Formula E-Race Case)కు సంబంధించి హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి(Former HMDA Chief Engineer BLN Reddy) శుక్రవారం అవినీతి నిరోధక బ్యూరో(Anti-Corruption Bureau) విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ(HMDA) ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో బీఎల్ఎన్ రెడ్డిని నిందితుల్లో ఏ3గా చేర్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR), ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్(IAS officer Arvind Kumar)లను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తన ఆదేశాల మేరకు నిధులను విదేశీ సంస్థకు బదిలీ చేసినట్లు కెటి రామారావు పేర్కొన్నట్లు సమాచారం.






