13 May, 2026 | 11:49 AM

రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం

13-05-2026 11:18 AM

దమ్మపేట, (విజయక్రాంతి):  రేపు సాయంత్రం అశ్వారావుపేట పట్టణ సమీపంలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతారని, మంత్రి తుమ్మల తో పాటు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఆయిల్ షెడ్ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారనీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి రైతులు భారీ ఎత్తున హాజరుకానున్నారనీ, తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ పంటను విస్తరించాలని లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ, 14వ తేదీన సాయంత్రం అశ్వరావుపేట సమీపంలో జరిగే ఈ రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశానికి అధికారులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పామాయిల్ రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయిల్  ఫెడ్ అధికారులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు సమాచారం అందించారు.