కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అస్వస్థత
13-05-2026 11:16 AM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో సోనియా గాంధీ(Sonia Gandhi) వైద్య పరీక్షల నిమిత్తం గురుగ్రామ్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ ఏడాది జనవరి నుంచి 79 ఏళ్ల ఈ రాజ్యసభ సభ్యురాలు ఆసుపత్రిలో చేరడం ఇది మూడవసారి. వర్గాల సమాచారం ప్రకారం, ఒక చిన్న శస్త్రచికిత్స నిమిత్తం సోనియా గాంధీ బుధవారం ఉదయం గురుగ్రామ్లోని 'మెదాంత - ది మెడిసిటీ'లో( Medanta - The Medicity, Gurugram) చేరారు. ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని వైద్యులు వెల్లడించారు.






