calender_icon.png 15 June, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామినేని ఆస్పత్రిలో రక్తదాన శిబిరం

14-06-2025 11:55:47 PM

ఎక్కువసార్లు రక్తదానం చేసిన వలంటీర్లకు సన్మానం..

ఎల్బీనగర్: ప్రపంచ రక్తదాతల దినోత్సవం(World Blood Donor Day) సందర్భంగా తలసీమియా బాధిత చిన్నారుల కోసం శనివారం కామినేని ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు వంద మందికి పైగా యువతీయువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిలో డాక్టర్లు, నర్సులు, ఆస్పత్రి సిబ్బంది కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం ఎక్కువసార్లు రక్తదానం చేసిన వలంటీర్లను సత్కరించి గౌరవించారు.

100  సార్లకు పైగా రక్తదానం చేసిన దయాకర్ రెడ్డిని ప్రత్యేకంగా సన్మానించారు. బ్లడ్ సెంటర్ హెడ్  డాక్టర్ ​వివేకానంద,  డాక్టర్ ​పునీత్,  డాక్టర్​ పునీత్ బాబు, మార్కెటింగ్ గ్రూప్ హెడ్ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాతలకు సన్మానం చేశారు. ప్రతి రక్తదాతకు ఆస్పత్రి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా కామినేని హాస్పిటల్స్ సమాజం పట్ల ఉన్న బాధ్యతను  చాటిందని,  ప్రాణాలను రక్షించే రక్తదానం పట్ల  ప్రజల్లో  అవగాహన పెంచే ప్రయత్నం చేయడంలో ఆస్పత్రి యాజమాన్యం ముందుంటుందని నిర్వాహకులు తెలిపారు.