14-06-2025 11:54:11 PM
సిద్దిపేట (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్ ల బదిలీలు చేపట్టింది. సిద్దిపేట కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎం మను చౌదరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ గా పని చేస్తున్న కే హైమావతి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కే హైమావతి బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు గరీమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పలువురు ఆర్డీవోలు కలెక్టర్ కు స్వాగతం పలికారు.