calender_icon.png 15 June, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ నోటీసులతో కేటీఆర్ హడల్

15-06-2025 12:00:00 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నోటీసు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శిం చారు. విచారణకు వెళ్తానని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే, బడాయి కబుర్లు చెపుతున్నారంటూ ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. సత్య హరిశ్చంద్రుడిలా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రికి నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయాలంటూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని, అయితే తొలుత కేసీఆర్, కవిత, హరీశ్‌రావుకు నార్కో టెస్ట్‌లు చేయించాలన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవితకు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్‌కు నార్కో టెస్ట్ చేయిద్దామన్నారు. చాలెంజ్‌లు విసిరి పారిపోయిన చరిత్ర కేటీఆర్‌దన్నారు.

గతంలో డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో వైట్ ఛాలెంజ్‌కు రావాలని తమ నాయకుడు రేవంత్‌రెడ్డి పిలిస్తే రాకుండా పారిపోయిన చరిత్ర కేటీఆర్‌ది అని విమర్శించారు. కేటీఆర్ .. నీ అతి తెలివి ప్రదర్శన ఆపి, ఏసీబీ అధికారుల ముందుకొచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నారు. జైలుకు వెళ్లాలన్న ఉబలాటం అంతగా ఉంటే మీ కోరికను దర్యాప్తు సంస్థలు తీర్చుతాయి.. తొందర పడకండని ఎద్దేవాచేశారు.