15-06-2025 12:32:06 AM
వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా 100 మందికి పైగా రక్తదానం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): వరల్డ్ బ్లడ్ డోనర్ డే సం దర్భంగా శనివారం కామినేని హాస్పిటల్స్ ఎల్బీనగర్ వారు తలసీమియా పిల్లల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విస్తృత స్పందన లభించింది. 100 మందికి పైగా యువతీ, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అందులో అనేకమంది డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.
కామినేని హాస్పిటల్స్ వద్ద ఎక్కువసార్లు రక్తదానం చేసిన వలంటీర్లను సత్క రించారు. వందస్లారకు పైగా రక్తదానం చేసి న దయాకర్రెడ్డిని ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో బ్లడ్ సెంటర్ హెడ్ డాక్టర్ వివేకానంద, డాక్టర్ పునీత్, డాక్టర్ పునీత్ బాబు, మార్కెటింగ్ గ్రూప్ హెడ్ సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రతి రక్తదాతకు ధ్రువీ కరణ పత్రాలను అందజేశారు.