13-06-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): కొలవండి, గమనించండి, నియంత్రించండి అనే మూడు ముఖ్యమైన సూత్రాలను పాటించడం ద్వారా మధుమేహాన్ని సమర్థవంతం గా నియంత్రించవచ్చున ని కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ కన్సల్టెంట్ ఎండోక్రినాల జిస్ట్ డాక్టర్ కృష్ణారెడ్డి తాడూరి తెలిపారు. జాతీయ మధుమేహ వారోత్సవం సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు.
భారతదేశంలో సుమారు 5 కోట్ల మంది మధుమేహంతో ఉన్నారన్న విషయం తెలియకుండా జీవిస్తున్నారని చెప్పారు. మధుమే హం అనేది శరీరంలో కార్బొహైడ్రేట్లును సరైన విధంగా ప్రాసె స్ చేయలేకపోవడం వల్ల ఇన్సులిన్ లోపం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏర్పడుతుందని చెప్పారు. భారతదేశంలో మధుమేహ ప్రబలత 11.4 శాతంకా గా, సుమారు 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని, వీరిలో ఇంకా 5 కోట్ల మంది రోగులు గుర్తించబడలేదని చెప్పారు.
ప్రజల్లో షుగర్ టెస్ట్ పై అవగాహన పెంచడం, జీవనశైలి మార్పులు, వ్యాయా మం, జాగింగ్, క్రీడలు, కార్డియో వర్కౌట్స్, ఆహార నియంత్రణ, ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా తీసుకుని, కార్బొహైడ్రేట్లు, కొవ్వులు తగ్గించడం ద్వారా మధుమేహాన్ని రాకుండా అడ్డుకోవచ్చన్నారు. మధుమేహం వచ్చాక, నిరంతరం వైద్యులను సంప్రదించాలన్నారు.