15-06-2025 12:34:00 AM
మెడికవర్ హాస్పిటల్స్, టెక్ మహేంద్ర సంయుక్తంగా నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): అంతర్జాతీయ వెల్నెస్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, టెక్ మహేంద్ర సంయుక్తంగా శనివారం హైదరాబాద్లో 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో వెలెనెస్ డేను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, ఉద్యోగులు, నర్సులు, ఇతర ఆరోగ్య సేవా నిపుణులు, టెక్ మహేంద్ర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఏజీఎం- కార్పొరేట్ రిలేషన్స్ శైలజ కోటా మాట్లాడుతూ.. ఈ విధమైన కార్యక్రమాలు ఆరోగ్యాన్ని పురోగతిపథంలో ఉంచేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. టెక్ మహేంద్రతో కలిసి ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడం సంతోషంగా ఉంది అని చెప్పారు.
టెక్ మహేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ డెలివరీ హెడ్ కృష్ణా కుమారి మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి ఇటువంచి ఆరోగ్య కార్యక్రమాలు కీలకం అని తెలిపారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీకి చెందిన వైద్యులు డాక్టర్ మిథిల్ బి ఘూషే (జనరల్ మెడిసిన్), డాక్టర్ మేఘనా సుభాష్ (పల్మనాలజిస్ట్) పాల్గొన్నారు.