14 April, 2026 | 5:14 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి: ఎస్పీ జానకి

01-11-2025 06:42 PM

రాజాపూర్: రక్తదానం చేసే మీ దాతృత్వం మరొకరి జీవితంలో సరికొత్త ఆశను చిగురింపజేస్తుంది అని సాటి మనిషి ప్రాణాలు జిల్లా ఎస్పీ జానకి అన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాలు పురస్కరించుకొని రాజాపూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటంలో రక్తదానానికి మించిన దానం లేదని అన్నారు.

నేడు రోడ్డు ప్రమాదాలు తల సేమియా బాధితులు కిడ్నీ బాధితులు వంటి ఎందరుకు మీరు అందించే ప్రతి రక్తపుబొట్టు వారి ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. యువత రక్తదానం చేసేందుకు ముందుండాలన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం చేసినందుకు ఎస్సై శివానంద్ గౌడ్ మరియు మండల ప్రజలు యువకులు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర్లు, సిఐ నాగార్జున గౌడ్, బాలానగర్ ఎస్సై లెనిన్, మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర నాయుడు, పోలీస్ సిబ్బంది, మండల ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.