calender_icon.png 15 June, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15న గడికోటలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం

14-06-2025 12:21:49 PM

దోమకొండ గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి

కామారెడ్డి,(విజయక్రాంతి): సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోనీ దోమకొండ గడికోటలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గడికోట మేనేజర్ బాబ్జి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి ప్రాంత, పరిసర గ్రామాల ప్రజలకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 15 జూన్ ఆదివారం  దోమకొండ గడికోట లో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామనీ గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి తెలిపారు. వేద పండితుల సమక్షంలో సరస్వతి పూజ అనంతరము చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుందన్నారు.

అక్షరాభ్యాసానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని పలకలను చిన్నారులకు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కావున ఈ  అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతారని ఆశిస్తున్నాము. ఈ  అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనదలచిన చిన్నారుల తల్లిదండ్రులు సంప్రదించవలసిన నెంబర్ 9493143378, 9441957951, 9948137616 నెంబర్లుకు ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరారు.