28 June, 2026 | 3:56 PM

Breaking News

లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •  

కూలీలను తరలిస్తున్న బోలోరో వాహనం బోల్తా

29-06-2024 11:05 AM

25 మంది కూలీలకు తీవ్రగాయాలు

మరి కొంతమంది పరిస్థితి విషమం   

నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో ఘటన           

నాగర్ కర్నూల్, విజయ క్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలను తరలిస్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో చోటు చేసుకుంది. తాడూరు మండలం ప్రాంతంలో పత్తి చేను కలుపు తీసేందుకు కూలీ కోసం కోడేరు మండలం చెందిన 25 మంది పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన మరో 25 మంది కూలీలను తరలిస్తుండగా కోడేరు మండలం పిఎసిఎస్ గోదావరి వద్ద అత్యంత వేగంతో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది.

దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న కూలీలకు కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గమనించి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చెన్నప్ప రావు పల్లి,  గండ్రావుపల్లి,  పెద్దకొత్తపల్లి మైసమ్మ వద్ద తదితర ప్రాంతాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని అతివేగంతో బోల్తా కొట్టిన ఘటనలో చోటు చేసుకున్నా అటు పోలీసులు, ఇటు ఆర్టీవో అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఈలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.