29-05-2025 06:17:53 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం(Tekulapally mandal) బొమ్మనపల్లి గ్రామంలో గురువారం ముత్యాలమ్మ తల్లికి బోనాలు ఘనంగా సమర్పించారు. మేళతాళాలతో అంగరంగా వైభవంగా డీజే నృత్యాలతో మహిళలు అమ్మవారికి ఇష్టమైన పాయసం, గుగ్గిలు, ఇష్టమైన ఆహార పదార్థాలు బోనం తీసుకొని సమర్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మహిళలు యువతి యువకులు వర్గాలవారిగా వెళ్ళి బోనాలు సమర్పించారు. తరువాత అమ్మ వారికి మేకలు, కోళ్లు సమర్పించారు. పంటలు బాగా పండాలని, ఊరి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మ వారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఊరి ఆడ బిడ్డలు అందరూ రావడంతో ఉరికి కొత్త కళ వచ్చినది. అందరూ ఆనంద ఉత్సవాలతో బోనాలు కార్యక్రమంను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి హాథిరామ్ నాయక్, గ్రామ కమిటీ సభ్యులు బానోత్ సాములు నాయక్, బుర్ర ధర్మయ్యా గౌడ్, బొమ్మెర్ల వరప్రసాద్, నల్లమసు రాజన్న, రత్నానాయక్, రమేష్ బాబు, నాయకులు నల్లమాసు శంకర్, హేమచంద్రనాయక్, హరికిషన్, బాలాజీ, రవి కుమార్, ప్రభాకర్, రమేష్, పార్వతీ, జ్యోతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.