29-05-2025 06:15:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రక్షణ కల్పిస్తుందని షీ టీం ఎస్ఐ నర్సయ్య(She Team SI Narsayya) తెలిపారు. గురువారం పట్టణంలోని నారాయణ స్కూల్ లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు మహిళల విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టాల మీద, చైల్డ్ మ్యారేజ్, జువెనైల్ చట్టాల మీద గంజా గస్తి ప్రోగ్రామ్ గురించి టీచర్స్ కి అవగాహన కల్పించి, వాళ్ళు పిల్లలకు అవగాహన కల్పించే విధంగా షీ టీం ఎస్ఐ నర్సయ్య అవగాహన కల్పించడం జరిగింది. నిర్మల్ లో గంజా పూర్తిగా రూపుమపడానికి ప్రతి ఒక్క టీచర్ తమవంతు సహకారం చేస్తూ సమాచారం ఉన్న లేదా తమ వద్ద చదువుకునే పిల్లల నడవిడక అనుమానాస్పదంగా ఉంటే వెంటనే 8712659599 అనే నంబర్ కి సమాచారం అందించగలరని అని తెల్పినారు. ఇట్టి కార్యక్రమంలో నర్సయ్య ఎస్ఐ, షి టీం సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సుమారు 60 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.