18-06-2025 12:00:00 AM
హుజూర్ నగర్,జూన్ 17: 2025-26 ఏడాదికి గానూ రాష్ట్రంలోని హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోరట్స్ పాఠ శాలలో 4వ తరగతి ప్రవేశానికి విద్యార్థినీ విద్యార్థులకు సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ NSP క్యాంపు ఉన్నత పాఠశాల లోజూన్ 19,2025 ఉదయం 10 గంటల కు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ సైదానాయక్ తెలిపారు. మండల స్థాయిలో ఎంపి కైన విద్యార్థులకు ఈనెల 23 నుంచి 26 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించను న్నారు.
ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు జులై 1 నుంచి 5 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ లోనిపాఠశాలలో బాలురు, బాలికలకు చెరో 20 సీట్లు ఉంటాయని తెలి పారు. విద్యార్థులకు 30 మీటర్ల ప్లయింగ్ స్టార్స్, స్టాండింగ్ జంప్, బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు, 6 X 10 మీటర్ల షటిల్ రన్, మెడి కల్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఎత్తు, బరువు ఫిజికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
అయితే విద్యార్థులు 01-09-2016 నుంచి 30-8-2017 మధ్య జన్మిం చడంతో పాటు 8 నుంచి 9 ఏండ్ల వయస్సు ఉండాలన్నారు. విద్యార్థులు ఆన్ లైన్లో tgss.telangan.gov.inలో తమ వివరా లను నమోదుచేసుకోవాలన్నా రు.ఈ ఆవకాశాన్ని పాఠశాలల యాజమాన్యాలు, తల్లి దండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.