calender_icon.png 23 July, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనమెత్తిన పటాన్‌చెరు ఎమ్మెల్యే

22-07-2025 12:00:00 AM

ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు

పటాన్‌చెరు, జులై 21 : పటాన్ చెరులో ఆషాడమాసం బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ప్రతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటికీటలాడింది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఫలహారం బండి అమ్మవారి ఆలయం నుంచి పట్టణంలో భారీ ఎత్తున ఊరేగించారు. వందలాది మంది కళాకారులు, పోతురాజులు, శివ సత్తుల పూనకాలతో ప్రజలందరితో పటాన్ చెరు పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొన్నది.

బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి డ్యాన్స్ చేసి అందరిని ఉత్సాహపరిచారు. ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా పటాన్ చెరు పట్టణ లోని వివిధ కాలనీలో గల అమ్మవారి దేవాలయాలను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. బోనాల పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ, వారి కుటుంబ సభ్యులు ఏడుగుల్ల పోచమ్మ దేవాలయంలో బోనం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీఐ వినాయక్ రెడ్డి,  గూడెం విక్రమ్ రెడ్డి, గూడెం సంతోష్ రెడ్డి, గూడెం సందీప్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ నాయకులు, ప్రజలుపాల్గొన్నారు.