08-11-2025 08:24:27 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలం స్నేహం సంగీత సాహిత్య సామాజిక సేవాసంస్థ అధ్యక్షురాలు, ఉపాధ్యాయిని దేవి ప్రియ రచించిన' నా మౌన కవనాక్షరాలు' అనే కవితా సంపుటిని ఆదర్శనగర్ శిశంమందిర్ ఉన్నత పాఠశాలలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని పుష్పలత అధ్యక్షతన ప్రముఖుల చేతి మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.
తుమ్మల దేవరావు పుస్తక సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామానుజాచార్యులు, రాఘవా చార్యులు కలం స్నేహం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కడారి దశరథ్, కొండూరు పోతన్న కవులు, లాయర్ నివేదిత నేరెళ్ళ హనుమంతు రాజారావు రవికాంత్, పోలీసు భీమేశ్ హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ... కవితా సంపుటిలోని కవితల గురించి చదివి ఆమెను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవయిత్రులు కిరణ్మయి శివరాణి, భైంసా కవులు కళాకారులు సాహిత్యాభిమానులు, భాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు.