పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
22-07-2026 03:09 PM
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు విపక్ష సభ్యుల నినాదాలతో ఉభయసభలు వాయిదా పడ్డాయి. సభా కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడ్డగా, ప్రారంభమైన నిమిషానికే మళ్లీ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే విపక్ష నేతలు ఆందోళన చేయడంతో స్పీకర్ రాజ్యసభ, లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. లోక్ సభ నుంచి టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీను స్పీకర్ ఓం బిర్లా సెస్పెండ్ చేశారు. మహిళా ఎంపీపై వ్యాఖ్యాల నేపథ్యంలో వర్షకాల సమావేశాలు ముగిసే వరకు కల్యాణ్ బెనర్జీను సస్పెండ్ చేశారు.






