17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఆ ఇద్దరూ బడి మానేశారు..!

14-06-2025 12:00 AM

రెండు రోజులుగా టీచర్ నిరీక్షణ 

పాఠశాలకు వచ్చేదే ఇద్దరు విద్యార్థులు.. ఆ ఇద్దరు ఈ ఏడాది బడికి రావడం మానేశారు. దీనితో రెండు రోజులుగా విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు ఏకాకిగా నిరీక్షిస్తున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెద్దమోరి తండా శివారు కొత్తూరులో వెలుగు చూసింది. గత విద్యా సంవత్సరం ముగింపు వరకు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చదువుతుండగా అందులో ఉమాదేవి నాలుగో తరగతి, సాత్విక్ మూడో తరగతి ముగించారు.

ఈ విద్యా సంవత్సరం గురువారం ప్రారంభం కాగా ఉమాదేవి ఐదో తరగతి, సాత్విక్ నాలుగో తరగతిలో చేరాల్సి ఉంది. అయితే గురువారం ఆ ఇద్దరు విద్యార్థులు పాఠశాలకు రాకుండా ముఖం చాటేశారు. విద్యార్థుల కోసం హెడ్మాస్టర్ వీరభద్రయ్య వారి ఇండ్లకు వెళ్లగా మేము హాస్టల్లో చేరుతామని, బడికి రామని చెప్పారు. రెండో రోజైనా మనసు మార్చుకొని పాఠశాలకు వస్తారని ఎదురు చూస్తున్న హెడ్మాస్టర్ కు నిరాశే ఎదురయ్యింది. శుక్రవారం కూడా పాఠశాలకు విద్యార్థులు రాకపోవడంతో కొత్తూరు పాఠశాల ‘ 0 ’ అటెండెన్స్ గా నిలిచింది.

 మహబూబాబాద్, విజయక్రాంతి