calender_icon.png 15 June, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదాముల్లోనే బియ్యం బుక్కేస్తున్నారు

14-06-2025 12:00:00 AM

  1. స్టాక్ పాయింట్లోని బియ్యం సంచులకు రంధ్రాలు
  2. వే బిల్లు లేకుండానే దుకాణాలకు సన్న బియ్యం తరలింపు
  3. ఒక్కో సంచి తూకం 4 నుంచి 5 కిలోలు లాస్.
  4. తీవ్రంగా నష్టపోతున్న రేషన్ డీలర్లు
  5. లబ్ధిదారులకు సైతం తూకాల్లో కోతలు 

నాగర్ కర్నూల్ జూన్ 13 (విజయక్రాంతి): గ్రామీణ మారుమూల ప్రాంత ప్రజలకు రేషన్ సరుకు అందించాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతంలోని రేషన్ దుకాణాలకు ప్రభుత్వం స్టాక్ పాయింట్ల ద్వారా బియ్యం సరఫరా చేస్తోంది. ఈ నెల నుండి ఒకేసారి మూ డు నెలలకు సరిపడా కోట బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది.

ప్రభుత్వ నుండి సరఫరా ఆయన బియ్యం సంచులు లారీల ద్వారా సరఫరా కావడంతో ఎత్తడం దింప డం వంటి సందర్భంలో చిరిగిపోవటం, రంధ్రాలు పడుతున్నాయి.  50 కిలోల బస్తాలో సుమారు ఐదు నుంచి 8 కిలోలు దాకా బి య్యం రంద్రాల గుండా నేలపాలవుతోంది. ఆయా రేషన్ దుకాణాలకు తరలించే క్రమంలోనూ వే బిల్లులు లేకుండానే సంచులవారీగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయడం తో  రేషన్ లబ్ధిదారుల ఆధారంగా అందిన కోటాలో ఒక్కో డీలర్ క్వింటాళ్లకొద్ది తూ కంలో తరుగు ఏర్పడి నష్టపోతున్నట్లు డీల ర్లు వాపోతున్నారు.

తామెందుకు నష్టపోవాలంటూ మరి కొంతమంది డీలర్లు లబ్ధిదారు లకు బియ్యం సరఫరా చేసే సమయంలోను కోతలు విధిస్తూ చేతులు దులిపేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని అక్రమ మార్గాన ఇతరులకు అమ్ముకుంటూ మరి కొంతమం ది లబ్ధిదారుల నుండి కేవలం వేలిముద్రం తీసుకొని డబ్బులు దండుకోవడంతో వారు చేసే తప్పులను అధికారులు ప్రశ్నించవద్దన్న ఉద్దేశంతో ఇలాంటి తప్పులను ప్రశ్నించడానికి జంకుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి.

తరచు గోదాములను తనిఖీ చేయాల్సిన ఉన్నతాధి కారులు కేవలం ఏసీ గ దులకే పరిమితం అవుతూ కంటి తుడుపుగా సమీక్షలు జరుపుతూ మామ అనిపిస్తుండడంతో క్రింది స్థాయి అధికారులంతా ప్రభుత్వం సరఫరా చేస్తే బియ్యం అమాంతం బుక్కేస్తున్నారని విమర్శలు వ్య క్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల గోదాం ఇన్చార్జీలు రేషన్ డీలర్లు బియ్యం సరఫరా చేస్తే లారీ ఓనర్లు అంత కుమ్మక్కై ప్రభుత్వం అం దించే సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 558 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేసేందుకు జిల్లా లో ఏడు గోదాములను ఏర్పాటు చేశారు. రేషన్ కార్డులు 2,43,213 ఉండగా 7,40, 610 యూనిట్లు ఉన్నాయి.  కాగా 5,103. 250 మెట్రిక్ టన్నులు బియ్యం కోట కాగా ఒకేసారి మూడు నెలలకు కలిపి 15,309.75 మెట్రిక్ టన్నులు బియ్యం సరఫరా చేస్తున్నట్లు అధికారిక లెక్కల ప్రకారం పంపిణీ చేస్తున్నారు.

గోదాములవారీగా కల్వకుర్తి 132 రేషన్ దుకాణాలకు గాను 3,050 మెట్రిక్ టన్నులు, నాగర్ కర్నూల్ 73 రేషన్ దుకాణాలకు గాను  1,924,  బిజినపల్లి 66 రేషన్ దుకాణాలకు గాను 1, 852, అచ్చంపేట 123 రేషన్ దుకాణాలకు గాను 3,037, తెలకపల్లి 63 దుకాణాలకు గాను 1,574, కొల్లాపూర్ 64 దుకాణాలకు గాను 1,777, పెద్దకొత్తపల్లి 37 దుకాణాలకు గాను 1,759 మెట్రిక్ ట న్నుల సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. 

 ప్రతినెల తనిఖీలు జరుపుతున్నాం

 జిల్లాలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ గోడౌన్లలో బియ్యం స్టాక్ పాయింట్లను ప్రతినెల తప్పనిసరిగా తనిఖీలు జరుపు తాం. రేషన్‌డీలర్లు తమ కోట బియ్యం తూకం వేసేసమయంలోస్వయంగా వా రే తనిఖీలు జరిపి సంతకం చేశాకే పం పిన జరుగుతోంది. ఎక్కడ ఎలాంటి అవకతవకలు తావు లేకుండా తనిఖీలు చేపడుతున్నాం. 

 రవికుమార్, సివిల్ సప్లై మేనేజర్ నాగర్‌కర్నూల్.