ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బొత్స సత్యనారాయణ
అమరావతి: వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వీరి భేటీలో విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో కూటమి పొటీ చేయకపోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. అభ్యర్థిత్వానికి సంబంధించి కూటమి నుండి మొదట సంకోచాలు ఉన్నప్పటికీ, వైఎస్ఆర్సిపి బొత్సకు మద్దతుగా నిలిచింది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయానికి దారితీసింది. ఈ సమావేశం అనంతరం శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు బొత్సతో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు.






