15 June, 2026 | 1:15 PM

Breaking News

కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •   విద్యుత్ షాక్ తో రైతు మృతి   •   ప్రైవేటీకరణపై.. కొత్త గనుల కోసం కొట్లాడుదాం   •  

బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. రెండూ మజ్లిస్ బానిసలే

02-11-2025 12:15 AM
  1. అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యం
  2. జూబ్లీహిల్స్ ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ లు రెండూ మజ్లిస్ బానిసలే అని, కేసీఆర్‌ది కుటుంబ పాలన అయితే ప్రజలను దగా చేసిన పాలన రేవంత్‌రెడ్డిది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో జరిగిన బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలూ ఏఐ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముం దు మోకరిల్లి, ఆయనకు బానిసలుగా పనిచేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబా ద్‌ను సింగపూర్, ఇస్తాంబుల్ చేస్తానని చెప్పి, చివరికి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.

బంగారు తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చి, తన కుటుంబా న్ని మాత్రమే బంగారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండే ళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. “జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీసం వీధి దీపాలు కూడా వేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.

యువతకు ఇస్తామన్న రూ.4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, స్కూటీలు, తులం బంగారం ఏమయ్యాయి?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యా భరోసా కార్డుల పేరుతో విద్యార్థులను, పావలా వడ్డీ రుణాల పేరుతో మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన మహిళలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఈ రెండు పార్టీలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.