15 June, 2026 | 2:49 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

సోయా టోకెన్ల జారీలో తొక్కిసలాట

02-11-2025 12:16 AM

తోపులాడుకోవడంతో కిందపడ్డ రైతులు

  1. ఇద్దరు మహిళా రైతులకు విరిగిన కాళ్లు 
  2. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఘటన

కుభీర్, నవంబర్ 1: సోయ పంటను అమ్ముకోవడానికి టోకెన్ల కోసం రైతులు ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి ఇద్దరు మహిళా రైతుల కాళ్లు విరిగాయి. పదిమంది రైతులకు గాయాలయ్యా యి. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో శనివారం జరిగింది. పీఏసీఎస్ కార్యాలయంలో సోయ పంట కొనుగోళ్లను ప్రభు త్వం ప్రారంభించింది. టోకెన్ల కోసం వచ్చిన వందలాది మంది రైతులు నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. మహిళా రైతులు లక్ష్మీబాయి, చంద్రకళ ఇద్దరికీ కాళ్లు విరుగగా మరో 10 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన పీఏసీఎస్ అధికారులు టోకెన్లజారీని నిలి పేశారు. పోలీసులు  రద్దీని నియంత్రించి, కూపన్లను జారీ చేశారు.