22 May, 2026 | 11:07 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారు

29-11-2025 12:00 AM

 తాండూరు, 28 నవంబర్ (విజయక్రాంతి ): సర్పం పదవులతో పాటు వార్డు సభ్యులు టిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలవబోతున్నారని వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు . శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ  సంగెం కాలాన్ సర్పం అభ్యర్థిగా కామిని మీనాక్షి అనిల్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నామినేషన్ సమర్పించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలకు మోసం చేసిందని విమర్శించారు.  మాయ మాటలతో ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల్లో ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన అన్నారు.