15 April, 2026 | 1:42 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

ఉద్యోగాలిస్తుంటే బీఆర్‌ఎస్‌కు కడుపుమంట

19-04-2025 12:00 AM

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంటే.. బీఆర్‌ఎస్ నేతలకు కడుపుమంట ఎందుకుని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పాత, కొత్త నోటిఫికేషన్లు కలిపి 57 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు.

ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీఆర్‌ఎస్ నిరుద్యోగులను మోసం చేసింద న్నారు. గ్రూప్-1పై బీఆర్‌ఎస్ నేతలు కావాలనే  కేసులు వేస్తున్నారనిమండిపడ్డారు. ఆ పార్టీ హయాంలో టీజీపీఎస్సీ, ఇంటర్ పేపర్లు లీకై విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు.. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ బిజినెస్‌లో బిజీగా ఉన్నారన్నారు.