20-11-2025 08:03:20 PM
అంబేద్కర్ కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు..
పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట..
బెజ్జంకి: మండలంలో అసంపూర్తిగా మిగిలిన రోడ్ల పనులు మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ గెలిచిన నుంచి మండలంలో అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. మండలంలో అసంపూర్తిగా మిగిలిన రోడ్ల పనులపై ఎమ్మెల్యే కవ్వంపల్లి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గురువారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి. మండల కేంద్ర వరకు బీఆర్ఎస్ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రోడ్లపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రకార్డులతో ర్యాలీ నిర్వహించారు.ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి ,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు.. శ్రేణులకు మద్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి అయా ఠాణాలకు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవ్సరాలవుతూన్న అసంపూర్తిగా నిలిచిన రోడ్ల పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేను బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.