calender_icon.png 27 June, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు గల్లంతు..?

26-06-2025 11:34:25 PM

కాంగ్రెస్ ప్రభుత్వమే దేశానికి. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష...!

రాహుల్ గాంధీ నేతృత్వంలో బీసీ కుల గణన చేయడం ఒక సాహసోపేత నిర్ణయం...

ఉనికి కోల్పోతున్నామనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతల విమర్శలు...

తొమ్మిదిన్నర ఏళ్ల  పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు ..

తొమ్మిది రోజుల్లోనే రూ :  9 వేల కోట్లు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం ....

విలేకరుల సమావేశంలో వనపర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొత్త కాపు రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ డా. రఘు ప్రసాద్ మాజీ జెడ్పిటిసి కొమ్ము వెంకటస్వామి...

వనపర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన ఎజెండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతుకావడం ఖాయమని పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ నేతలు(Congress Party leaders) అన్నారు. గురువారం పెద్దమందడి మండల కాంగ్రెస్ నేతలు వెల్టూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా వనపర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొత్త కాపు రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ డా. రఘు ప్రసాద్ మాజీ జెడ్పిటిసి కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ నేతలకు వెన్నులో వణుకు పుడుతుందని తమకు ఎక్కడ పుట్టగతులు ఉండవు అన్న ఆలోచనతో ఆ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రతిరోజు  విమర్శలు గుప్పిస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీరామరక్ష అని వారు గుర్తు చేశారు దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పటి నుండి మొదలు కంటే తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కిందని వారు అన్నారు.

రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయిందని ప్రతి రోజు ఏదో ఒక రకమైన ఆందోళన చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరని వారిని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్ కార్డుగానీ  డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిన పాపన పోలేదన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా చరిత్రలో నిలిచిందని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అవినీతిలో రికార్డు కు ఎక్కిన గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించి ఇంట్లో కూర్చోబెట్టిన వారికి బుద్ధి రాలేదని కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు  ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ ఊచలు లెక్క పెట్టడం ఖాయమని ఫోన్ టాపింగ్ అంతా సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదని వారు కేటీఆర్ ను బియ్యబట్టారు. రైతులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తే పుట్టగతులు ఉండవు అని వారు బిఆర్ఎస్ నేతలను హెచ్చరించారు.

ప్రజా పాలనలో భాగంగా పెద్దమందడి మండలానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి 394 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని. విడతలవారీగా ఇందిర ఇండ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు డబ్బులు చెల్లించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని వారు గుర్తు చేశారు. విలేకర్ల సమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ గౌని వెంకటేశ్వర్ రెడ్డి బాబు రెడ్డి  సర్పంచులు రమేష్ యాదవ్. రాధాకృష్ణ. చింతకాయల వెంకటేష్. మాజీ ఎంపీటీసీలు రామచంద్రయ్య గౌడ్ కాంగ్రెస్ నాయకులు విట్ట వెంకటేశ్వర్ రెడ్డి  అమ్మపల్లి బాలు. శ్రీశైలం యాదవ్ రాఘవేందర్  రవి యాదవ్ టైలర్ రవి గోపాల్ నాయక్ వడ్డే శేఖర్. రవి సాగర్ తదితరులు పాల్గొన్నారు.