27-06-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): టీచర్లతో స్కూళ్ల తనిఖీకి సంబంధించి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని, వారితో బడులు తనిఖీలు చేయించడం సరి కాదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య పేర్కొన్నా రు.
పైగా టీచర్లను తీవ్రమైన ఒత్తిడికి, మానసిక సంఘర్షణకు గురి చేసేలా ఉన్న ఆ ఉత్తర్వుల ను పునఃసమీక్షించి రద్దు చేయాలని కోరుతూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ను గురువారం కలిసి వినతిపత్రం అందజే శారు. కేజీబీవీల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే టీచర్లను వెంటనే తొలగించకుండా.. నోటీసులిచ్చి విచారణ జరిపేలా చూడాలని కోరారు.
మోడల్ స్కూళ్లలో 317 జీవో అమలులో సమస్యలు తలెత్తకుండా చూడాలని తపస్ ఉపా ధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేష్ విజ్ఞప్తిచేశారు. మోడల్ స్కూళ్లలో క్యాడర్ విభజనకు సంబంధించి విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.