calender_icon.png 4 May, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజురాబాద్ లో పెరిగిన కౌశిక్ అరాచకాలు

23-04-2025 02:48:32 PM

ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకొని వసూలుకు పాల్పడుతున్న కౌశిక్.

 హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు.

హుజురాబాద్,విజయక్రాంతి: హుజరాబాద్ లో పెరిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) అరాచకాలు,పదవి అడ్డుపెట్టుకొని భారీఎత్తున వసూల్ కి పాల్పడుతున్నాడని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణబ్ బాబు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు సభ్య సమాజంలో ప్రజలకు అవసరమయ్యే పనులు చేయాలి కానీ పదవిని అడ్డుపెట్టుకొని వ్యాపారస్తులను, ఇతర వర్గాలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం సబబు కాదని అన్నారు. కమలాపూర్ మండలం(Kamalapur Mandal) వంగపల్లి-గుండేడ్ గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి గ్రానైట్ వ్యాపారి కట్టా మనోజ్ రెడ్డి దగ్గర హుజురాబాద్ ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేశాడని సాక్షాత్తు వాళ్ళ భార్య రమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వడం, అదీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ప్రతినిధిపై మహిళ దరఖాస్తు ఇవ్వడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని,కౌశిక్ రెడ్డి చర్యలవల్ల ఇప్పటికే హుజురాబాద్ పరువు దిగజారుతుందని ఇలాంటి చర్యల ద్వారా మరింత దిగజార్చుతున్నాడని అన్నారు.

గతంలో కూడా అనేకమందిని బెదిరించి ఇబ్బందులకు గురిచేసాడని ఇలాంటి ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించుకున్నామని హుజురాబాద్ ప్రజలు అంతర్మదనంలో పడ్డారని అన్నారు.హైదరాబాద్ లో నీతి మాటలు చెప్పే కేటిఆర్ మీ బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలపై మీ వైఖరేంటో తెలియజేయాలని,ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిపితే కౌశిక్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదని అన్నారు.10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఉప ఎన్నికలు వస్తాయని కేటిఆర్ పదే,పదే చెప్పడం కాదనీ కౌశిక్ రెడ్డి రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని,అప్పుడు మీరో,మేమో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని ప్రణవ్ అన్నారు.

కౌశిక్ రెడ్డి అరాచకాలు ఇంకెన్ని బయటపడతాయో అని ప్రజలు చర్చింటుకుంటున్నారని, కౌశిక్ రెడ్డి భాదితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని సూచించారు.ఎమ్మెల్సీగా హుజురాబాద్ కు ఏం నిధులు తీసుకొచ్చావని అడిగితే ఇప్పటివరకు సమాధానం లేదని,ఉప ఎన్నికల సమయంలో ఎలాంటి పనులు చేశారో అందరికీ తెలిసిందే అని ఎమ్మెల్సీగా, ఎమ్మేల్యేగా కౌశిక్ రెడ్డి విఫలమయ్యాడని అన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి,కమలాపూర్ మార్కేట్ చైర్మెన్ ఝాన్సీ-రవీందర్,హుజురాబాద్ పట్టణ,మండల అధ్యక్షులు తిరుపతి, కిరణ్,హనుమాన్ దేవాలయ చైర్మెన్ శంకర్,హుజురాబాద్ మండల,పట్టణ మహిళా అధ్యక్షురాలు పుష్పలత,రాధ,నాగమణి,వంశీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.